Sneha Reddy : సోషల్ మీడియాలో ఏ హీరో భార్యకు లేని ఫాలోవర్లు.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి ఉన్నారు. ఆమె హీరోయిన్లకు సమానంగా సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు ఆమె సోషల్ ఖాతాల్లో అప్డేట్స్ ఇస్తుంటారు. ఎప్పుడు వెకేషన్కు వెళ్లినా అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేస్తుంటారు. ఇక తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్లతో కాసేపు ముచ్చటించారు. లైవ్లోకి వచ్చిన ఆమె తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక వాటిల్లో ఒక ఆసక్తికరమైన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేమిటంటే..
అల్లు అర్జున్ కు ఇష్టమైన ఫుడ్ ఏదని ఒక నెటిజన్ అడగ్గా.. అందుకు స్నేహా రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయనకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ అని బదులు చెప్పారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్గా మారింది. ఇక అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 షూటింగ్లో పాల్గొననున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మొదటి పార్ట్కు విశేషమైన ఆదరణ లభించడం.. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయడం.. కేజీఎఫ్ 2 విడుదల.. వంటి అంశాల వల్ల పుష్ప 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకని సుకుమార్ స్క్రిప్ట్ను చాలా పకడ్బందీగా రూపొందిస్తున్నారని.. అందుకనే షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఇక మొదటి పార్ట్లో నటించిన వారందరూ రెండో పార్ట్లోనూ నటించనున్నారు. ముఖ్యంగా మొదటి భాగంలో దాక్షాయణిగా నటించిన అనసూయకు ఎక్కువ సేపు తెరపై కనిపించే అవకాశం లేకుండా పోయింది. కానీ రెండో పార్ట్లో ఆమె పాత్ర నిడివి పూర్తి స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇక పుష్ప 2 కు గాను సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే కొన్ని ట్రాక్స్ను సిద్ధం చేసి ఉంచారని తెలుస్తోంది.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…