Mahesh Babu : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆచార్య సినిమాపై ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఉంటుందా.. అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. రీసెంట్గా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా, ఈ ఈవెంట్కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరు కాలేదని తెలుస్తోంది.
రైతు భరోసా యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో పర్యటించిన పవన్ కల్యాణ్.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ దూరంగా ఉంటున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం రాజమౌళి హాజరుయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరు.. అని తెలుసుకున్న ఆచార్య చిత్ర యూనిట్ ఆ తర్వాత మహేష్ బాబును పిలవాలని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మహేష్ బాబుకు మంచి అనుబంధం ఉంది.
రామ్ చరణ్ కి కూడా మహేష్ మంచి స్నేహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇక కొరటాల శివతో మహేష్ రెండు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు కాబట్టి తప్పకుండా వస్తారని అనుకున్నారు. అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నాడని.. అందుకే హాజరుకాలేక పోయినట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా పవన్, మహేష్.. ఆచార్య ఈవెంట్కు వచ్చి ఉంటే.. ఆ కిక్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…