Chiranjeevi : కొన్ని నెలల క్రితం సినీ పరిశ్రమ టిక్కెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఎంతగా ఇబ్బంది పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు కరోనాతో జనాలు థియేటర్స్కి రావడమే గగనం అన్న పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్స్ని భారీగా తగ్గించేసింది. ఈ క్రమంలో చాలా మంది నిర్మాతలు గగ్గోలు పెట్టారు. అప్పుడు చిరంజీవి ఈ సమస్యని తన సమస్యగా తీసుకొని జగన్తో చర్చించారు. టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సీఎం జగన్ దగ్గర చేతులు జోడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో దీనిపై అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు.
చిరంజీవిని జగన్ దారుణంగా కించపరిచారని తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. లేని సమస్యలను సృష్టించి.. మళ్లీ తానే తీర్చేసినట్లుగా సినిమా హీరోలను ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. సీఎం జగన్కు రెండు చేతులు జోడించి తమ సమస్యలు ఏకరువుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సీఎం జగన్ను ఇంతలా ప్రాధేయపడాలా అని చంద్రబాబు ఆక్షేపించారు. పలువురు నిర్మాతలు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు ఇతర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు, చరణ్ పాత్రకు మధ్య ఎలాంటి బంధం ఉండదని అయితే ప్రేక్షకులు తెరపై ఆ బంధాన్ని ఫీలవుతారని చిరంజీవి కామెంట్లు చేశారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతోపాటు మరో ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయని చిరంజీవి తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలను తాను చేతులు జోడించి వివరించానని అలా చేయడం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమైందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలా చేయడం నా ఒక్కడి కోసం అయి ఉంటే సిగ్గుపడే వాడినని, లక్షల మంది సమస్యను పరిష్కరించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం అని తాను భావిస్తానని ఆయన వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…