Chiranjeevi : కొన్ని నెలల క్రితం సినీ పరిశ్రమ టిక్కెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఎంతగా ఇబ్బంది పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు కరోనాతో జనాలు థియేటర్స్కి రావడమే గగనం అన్న పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్స్ని భారీగా తగ్గించేసింది. ఈ క్రమంలో చాలా మంది నిర్మాతలు గగ్గోలు పెట్టారు. అప్పుడు చిరంజీవి ఈ సమస్యని తన సమస్యగా తీసుకొని జగన్తో చర్చించారు. టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సీఎం జగన్ దగ్గర చేతులు జోడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో దీనిపై అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు.
చిరంజీవిని జగన్ దారుణంగా కించపరిచారని తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. లేని సమస్యలను సృష్టించి.. మళ్లీ తానే తీర్చేసినట్లుగా సినిమా హీరోలను ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. సీఎం జగన్కు రెండు చేతులు జోడించి తమ సమస్యలు ఏకరువుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సీఎం జగన్ను ఇంతలా ప్రాధేయపడాలా అని చంద్రబాబు ఆక్షేపించారు. పలువురు నిర్మాతలు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు ఇతర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు, చరణ్ పాత్రకు మధ్య ఎలాంటి బంధం ఉండదని అయితే ప్రేక్షకులు తెరపై ఆ బంధాన్ని ఫీలవుతారని చిరంజీవి కామెంట్లు చేశారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతోపాటు మరో ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయని చిరంజీవి తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలను తాను చేతులు జోడించి వివరించానని అలా చేయడం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమైందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలా చేయడం నా ఒక్కడి కోసం అయి ఉంటే సిగ్గుపడే వాడినని, లక్షల మంది సమస్యను పరిష్కరించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం అని తాను భావిస్తానని ఆయన వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…