Chiranjeevi : కొన్ని నెలల క్రితం సినీ పరిశ్రమ టిక్కెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఎంతగా ఇబ్బంది పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు కరోనాతో జనాలు థియేటర్స్కి రావడమే గగనం అన్న పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్స్ని భారీగా తగ్గించేసింది. ఈ క్రమంలో చాలా మంది నిర్మాతలు గగ్గోలు పెట్టారు. అప్పుడు చిరంజీవి ఈ సమస్యని తన సమస్యగా తీసుకొని జగన్తో చర్చించారు. టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సీఎం జగన్ దగ్గర చేతులు జోడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో దీనిపై అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు.
చిరంజీవిని జగన్ దారుణంగా కించపరిచారని తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. లేని సమస్యలను సృష్టించి.. మళ్లీ తానే తీర్చేసినట్లుగా సినిమా హీరోలను ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. సీఎం జగన్కు రెండు చేతులు జోడించి తమ సమస్యలు ఏకరువుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సీఎం జగన్ను ఇంతలా ప్రాధేయపడాలా అని చంద్రబాబు ఆక్షేపించారు. పలువురు నిర్మాతలు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు ఇతర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు, చరణ్ పాత్రకు మధ్య ఎలాంటి బంధం ఉండదని అయితే ప్రేక్షకులు తెరపై ఆ బంధాన్ని ఫీలవుతారని చిరంజీవి కామెంట్లు చేశారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతోపాటు మరో ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయని చిరంజీవి తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలను తాను చేతులు జోడించి వివరించానని అలా చేయడం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమైందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలా చేయడం నా ఒక్కడి కోసం అయి ఉంటే సిగ్గుపడే వాడినని, లక్షల మంది సమస్యను పరిష్కరించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం అని తాను భావిస్తానని ఆయన వెల్లడించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…