Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార.. తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో తన తండ్రి కన్నా బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే మహేష్ నటించిన సర్కారు వారి పాట మూవీ లోంచి ఈమె పెన్నీ అనే సాంగ్కు డ్యాన్స్ చేసి అలరించింది. దీంతో సితార బాగా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంతో యాక్టివ్గా ఉంటుంది. కేవలం తన తండ్రి సినిమాలకు చెందిన పాటలకే కాకుండా.. ఇతర పాటలకు కూడా ఈమె డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటుంది.
అయితే సితార భవిష్యత్తులో హీరోయిన్ అవుతుందా ? అని మహేష్ను ఇటీవల అడగ్గా.. అందుకు ఆయన బదులిస్తూ.. ప్రస్తుత తరుణంలో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వారు ఏం అవదలుచుకుంటారో ఆ నిర్ణయాన్ని వారికే వదిలేయాలి. అయితే సినిమా ఇండస్ట్రీలోకి సితార వస్తే మాత్రం మంచి నటి అవుతుందని.. మహేష్ అన్నారు. దీంతో అందరిలోనూ ఆశ్చర్యం నెలకొంది. అయితే సితార సినిమా ఇండస్ట్రీలోకి కచ్చితంగా వస్తుందని.. తండ్రి పేరు నిలబెడుతుందని.. మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.
కాగా సితార తాజాగా మరోమారు వార్తల్లో నిలిచింది. ఆమె ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో సితార స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేశావని కితాబిస్తున్నారు. ఇక సితార తనకు సమంత అంటే ఎంతో ఇష్టమని గతంలో తెలియజేసింది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…