Viral Video : కోతులు.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వాటి అల్లరి. కోతులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అందుకనే పిల్లలను కూడా కోతులతో పోలుస్తుంటారు. వాటికి ఆహారం కనబడితే చాలు.. అవి తినడం కన్నా.. వృథా చేసేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇళ్ల వద్ద సామాన్లు కనబడితే చాలు.. చిందరవందర చేస్తాయి. వాటి దగ్గర ఉంటే కొన్ని సార్లు మనల్ని బెదిరిస్తాయి కూడా. కనుకనే కోతి చేష్టలు అని కూడా అంటుంటారు. అయితే ఆ కోతి మాత్రం చిలిపి కోతిలా ఉంది. ఎందుకంటే అది చేసిన పని అలాంటిది మరి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఓ యువతి ఓ పార్కులో కూర్చుని ఉండగా.. ఆమె వెనుక నుంచి ముందుగా ఓ కోతి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆ యువతి సెల్ఫీ వీడియో తీస్తోంది. ఇక ముందుగా వచ్చిన కోతి ఆమె మెడలో ఉన్న క్రిస్టల్ను తాకి వెళ్లింది. దీంతో ఆమె.. ఆ కోతికి నా క్రిస్టల్ అంటే ఇష్టంలా ఉంది.. అని మాట్లాడింది. ఇక వెంటనే ఇంకో కోతి వచ్చింది. అది వచ్చి ఆమె వెనుకగానే ఉంది. కానీ ఆమె మాట్లాడుతుండగానే.. ఆ కోతి వెనుకనే ఉండి ఆమె డ్రెస్ను పైకెత్తి చూసింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. వెంటనే ఆ కోతిని తరిమేసి పెద్దగా నవ్వింది.
కాగా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటికే 2.53 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 10వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది చాలా చిలిపి కోతిలా ఉందే.. అని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…