Akira Nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే అకీరా నందన్ బర్త్ డేను జరుపుకోగా.. తన తండ్రికి తగినట్లే అతను రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నాడు. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీలోంచి కళావతి అనే సాంగ్ను పియానోపై వాయించి ఆశ్చర్యపరిచాడు. అకీరానందన్లో ఉన్న టాలెంట్ గురించి పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి మింగుడు పడని వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే..
ఇటీవల అకీరానందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్, రేణు దేశాయ్ ఒకే ఫ్రేములో కనిపించి అలరించారు. దీంతో వారి ఫొటో వైరల్గా మారింది. పవన్, రేణు దేశాయ్ చాలా రోజుల తరువాత ఒకే చోట కనిపించడం ఆయన ఫ్యాన్స్కు ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలబడ లేదు. కారణం.. అకీరా నందన్కు పవన్ ఇంటి పేరు కొణిదెల పెట్టకపోవడమే. అకీరానందన్కు తన తల్లి ఇంటి పేరు పెట్టారు. అకీరా నందన్ దేశాయ్ గా పెట్టారు. అయితే ఈ విషయం గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తీసిన ఓ వీడియో ద్వారా వెల్లడైంది.
అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీలోని దోస్తీ పాటను అతను పియానోపై వాయించాడు. అయితే ఆ సందర్భంగా తెరపై అకీరా నందన్ దేశాయ్ అని కనిపించింది. దీంతో పిక్చర్ క్లియర్గా అర్థమైంది. అకీరా నందన్కు తండ్రి ఇంటి పేరు కొణిదెల పెట్టలేదని.. తల్లి ఇంటి పేరు వచ్చే విధంగా దేశాయ్ అని పెట్టడం జరిగిందని.. స్పష్టమైంది. దీంత పవన్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాస్తవానికి పవన్.. రేణుకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి అకీరా, ఆద్యలు ఆమె దగ్గరే పెరుగుతున్నారు. అప్పుడప్పుడు పవన్ను కలిసేందుకు అకీరా వెళ్తుంటాడు. కనుక రేణు ఇంటి పేరునే అకీరాకు పెట్టారని అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ విషయం పవన్ ఫ్యాన్స్కు మాత్రం కాస్త అసంతృప్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…