Bhanu Chander : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే హిందీ మార్కెట్లోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బన్నీ వేసిన శ్రీవల్లి స్టెప్తోపాటు రష్మిక మందన్న సామి సాంగ్.. ఆ తరువాత సమంత నటించిన ఊ అంటావా మావా.. పాట.. బంపర్ హిట్ అయ్యాయి. వీటికి ఇప్పటికీ చాలా మంది స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి క్రికెటర్ల వరకు పుష్ప తగ్గేదేలే.. డైలాగ్ను చెబుతూ అలరిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి సీనియర్ నటుడు భానుచందర్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.
భానుచందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పుష్ప గురించి మాట్లాడుతూ.. పుష్ప మూవీలో సమంత ఐటమ్ సాంగ్ అద్భుతంగా చేసింది. ఆ పాటలో ఇతరులు ఎవరైనా డ్యాన్స్ చేసి ఉండవచ్చు. కానీ సమంత డ్యాన్స్ చేయడం వల్లే పుష్ప సినిమా అంత పెద్ద హిట్ అయింది. సమంత వల్లే ఆ మూవీ హిట్ టాక్ను సొంతం చేసుకుంది.. అని అన్నారు. దీంతో భానుచందర్పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి సమంత చేసింది ఐటమ్ సాంగ్ మాత్రమే. ఆమె కాకుండా ఆ పాట ఎవరు చేసినా హిట్ అయి ఉండేది. ఎందుకంటే పాట అలాంటిది మరి. ఇక సినిమా మాత్రం అల్లు అర్జున్ వల్లే హిట్ అయింది. ఆ విషయం ఎవర్ని అడిగినా చెబుతారు. బన్నీ యాక్టింగ్ ఇందులో సూపర్బ్. అల్లు అర్జున్ కాకుండా ఆ పాత్రలో ఇతర ఏ హీరో నటించినా అంత పెద్ద హిట్ అయి ఉండేది కాదేమో. అంతలా బన్నీ ఆ పాత్రలో జీవించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశాడు. అలాంటి కేవలం ఒక్క పాటలో నటిస్తే సమంత వల్లే సినిమా హిట్ అయిందని అనడంలో అర్థం లేదు. కనుకనే బన్నీ ఫ్యాన్స్కు కోపం వచ్చింది. దీంతో భాను చందర్ను తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై భాను చందర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…