Sitara Dance : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నారి చేసే రచ్చకి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. నిత్యం తనకు సంబందించిన ఫొటోస్, వీడియోలను ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో షేర్ చేస్తూ నెటిజన్స్ని అలరిస్తూ ఉంటుంది సితార. ‘సర్కారు వారి పాట’ సినిమా ద్వారా లైమ్ లైట్లోకి వచ్చిన సితార.. ఎప్పటికపుడు మహేష్ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా తండ్రి మహేశ్ బాబు సాంగ్కు స్టెప్పులేసి అందరిచే ఔరా అనిపించింది. 2005లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష జంటగా వచ్చిన సినిమా అతడు ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే.
అతడు సినిమాలో ‘పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి..’ అనే పాటకు త్రిష వేసిన స్టెప్పులను ఎవరూ మర్చిపోలేరు. ఇదే పాటకు తాజాగా మహేష్ బాబు ముద్దుల కూతురు సితార స్టెప్స్ వేసి అలరించింది. అచ్చు త్రిష వేసిన మాదిరిగానే స్టెప్స్ వేసి సీతూ పాప అలరించింది.. సితార క్యూట్ డ్యాన్స్ వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. సీతూ పాప హావభావాలకు మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
పదేళ్ల వయసున్న సితార రానున్న సంవత్సరాలలో ఘట్టమనేని వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ కూతురు చదువుతో పాటు సంగీతం, డ్యాన్స్ కూడా నేర్చుకుంటోంది. మరోవైపు సూపర్ స్టార్ వారసుడు గౌతమ్ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘వన్- నేనొక్కడినే’ సినిమాలో గౌతమ్ నటించాడు. ప్రస్తుతం అతడు చదువుపై శ్రద్ద పెట్టాడు. రానున్న రోజులలో వీరిద్దరు కూడా వెండితెరపై అలరించే అవకాశం ఉంది. మహేష్ వారసులుగా వారు వెండితెరని ఏలనున్నారని కొందరు జోస్యాలు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…