Sindhu Menon : 2001లో శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మళయాళీ ముద్దుగుమ్మ సింధూ మీనన్. ఈమె మళయాళీ కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది. సింధు మీనన్ అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని విజేతగా ఎన్నో బహుమతులను గెలుచుకుంది. సింధు మీనన్ విజేతగా నిలిచిన సమయంలో ఆ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ డైరెక్టర్ కె వి జయరాం సింధు మీనన్ ను వెండి తెరకు పరిచయం చేయడం జరిగింది. 1994 లోజయరాం దర్శకత్వం వహించిన రశ్మి అనే కన్నడ చిత్రంతో సింధు మీనన్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.
1999లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సింధు మీనన్. ఆ తర్వాత తెలుగులో భద్రాచలం, త్రినేత్రం, శ్రీరామచంద్రులు, చందమామ వంటి పలు సినిమాలలోనటించి తెలుగు తెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. చందమామ, వైశాలి వంటి సినిమాలతో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సింధుమీనన్. ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రేక్షకులలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తెలుగువారిలో సింధు మీనన్ కి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తర్వాత అవకాశాలు తగ్గడంతో నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పటి తరం వారికి చాలా వరకు సింధుమీనన్ తెలియకపోవచ్చు. చిత్రాలకు దూరమైన తర్వాత వంశం అనే మళయాళం సీరియల్ ద్వారా సింధుమీనన్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతేకాకుండా టీవీ షోలలో హోస్ట్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత 2010లో ఐటీ ప్రొఫెషనల్ అయిన డొమినిక్ ప్రభును వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప కూడా ఉన్నారు. తాజాగా సింధు మీనన్ ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…