Shriya Saran : టాలీవుడ్ నటి శ్రియ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు చెప్పబోయేది ఆర్ఆర్ఆర్లో ఆమె పాత్ర గురించి కాదు. ఆమె సడెన్గా ఓ వీడియోను పోస్ట్ చేసింది. దాని గురించే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. ఆ వీడియోను ఫ్యాన్స్ చూసి మైమరిచిపోతున్నారు. ఆమె గర్భంతో ఉన్నప్పుడు బేబీ బంప్తో తీసిన వీడియో అది. అందులో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే ఆమెకు ప్రస్తుతం కుమార్తె జన్మించింది. ఈ క్రమంలోనే ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు శ్రియ ఓ కాప్షన్ కూడా పెట్టింది.2020 లుకింగ్ బ్యాక్ అని కామెంట్ చేసింది. అయితే శ్రియ గర్భంతో ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అంతటి టాప్ సీక్రెట్ను ఈమె మెయింటెయిన్ చేసింది. ఇక చివరిగా తన కుమార్తెను చూపిస్తూ ఈమె తనకు పుట్టిందని తెలిపింది. దీంతో ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. కాగా శ్రియ రష్యాకు చెందిన ఆండ్రె కొశ్చివ్ను 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె రష్యాలోనే ఎక్కువగా ఉంటోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం ఇండియాకు వస్తోంది. 2021లో ఆమెకు కుమార్తె జన్మించింది.
శ్రియ ప్రస్తుతం తనకు ఖాళీ సమయం లభిస్తే చాలు.. కుమార్తెతోనే ఎక్కువగా కాలం గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమె తన కుమార్తెతో ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్లో శ్రియ రామ్ చరణ్కు తల్లిగా నటించింది. అయినప్పటికీ ఆమె పాత్రపై ప్రేక్షకులు పాజిటివ్గానే స్పందించారు. ఇక శ్రియ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తడ్కా, నరగసూరన్, కబ్జా వంటి చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇవి రానున్న రోజుల్లో విడుదల కానున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…