Hyper Aadi : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ షోతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్లో హైపర్ ఆది ఒకరు. ఆయన తనదైన శైలిలో పంచ్లు విసురుతూ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ప్రతి ఒక్కరినీ ఉద్దేశిస్తూ బాగా పంచులు వేస్తుంటాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా మల్లెమాల ప్రొడక్షన్ కు సంబంధించిన పలు షో లలో కూడా చేస్తున్నాడు. మధ్య మధ్యలో పలు ఈవెంట్లలో కూడా బాగా సందడి చేస్తూ ఉన్నాడు.
కొంత కాలంగా హైపర్ ఆది జబర్దస్త్లోనే కాక శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించడం లేదు. అతనితోపాటు అతని టీం కూడా షోలో పాల్గొనడం లేదు. దీంతో హైపర్ ఆది వేరే షోకి వెళ్లాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం హైపర్ ఆది.. మల్లెమాల వారితో ఉన్న ఒప్పందం ముగింపు దశకు చేరుకుందట. అంటే హైపర్ ఆది త్వరలోనే మల్లెమాల వారితో పూర్తిగా తెగదెంపులు చేసుకోనున్నాడని, మాటీవీ కామెడీ స్టార్స్ లో కనిపించనున్నాడనే టాక్ నడుస్తోంది. మరి చూడాలి.. దీనిపై రానున్న రోజులలో అయినా క్లారిటీ వస్తుందేమో.
ఇదిలా ఉండగా ఆది అటు ఢీలో మాత్రం కనిపిస్తున్నారు. దీంతో ఆది ఫ్యాన్స్ మాత్రం మళ్లీ జబర్దస్త్లో తమ అభిమాన కమెడియన్ ఆది రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా జబర్దస్త్లో జడ్జిగా కొనసాగిన నటి రోజా జబర్దస్త్కు బైబై చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ఎమ్మెల్యే అయ్యాక కూడా జబర్దస్త్ని వదల్లేదు. ఆ షోకు మధ్యలో నాగబాబు దూరమైనప్పటికీ రోజా అలానే కొసాగుతూ వచ్చారు. ఇటీవల తప్పక ఆమె గుడ్ బై చెప్పింది. ప్రముఖులు అందరు ఇలా జబర్దస్త్ని వీడితే షో పరిస్థితి ఏంటని కొందరు ఆలోచనలు చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…