Vijay Devarakonda : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలో ఈ ఏడాదిలో వరుసగా విడుదల కానున్నాయి. అయితే అంత బిజీగా ఉంటూ కూడా సమంత వెకేషన్లలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె థాయ్లాండ్ లో విహరిస్తోంది. అక్కడి ఓ రెస్టారెంట్లో గ్లామరస్గా దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే సమంతకు చెందిన ఓ ఫొటోను విజయ్ దేవరకొండ మార్ఫింగ్ చేసి ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఫొటో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
విజయ్ దేవరకొండ, సమంత.. హీరో హీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ పూజ కార్యక్రమానికి హీరోయిన్ సమంత హాజరు కాలేదు. ఆమె వెకేషన్లో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. దీంతో లోకులు పలు కాకులు అన్నట్లు మీడియా మొత్తం కోడై కూసింది. అసలు ఆమె పూజకు ఎందుకు వెళ్లలేదు.. హీరోయిన్గా అంత పొగరు పెరిగిపోయిందా.. పూజ కార్యక్రమానికి కూడా హాజరు కానంత బిజీ అయిందా.. అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే అన్నింటికీ చెక్ పెట్టేలా విజయ్ ఓ ఫొటోను షేర్ చేశాడు.
పూజ కార్యక్రమానికి చెందిన ఫొటోలో సమంతను చేర్చి విజయ్ ఆ ఫొటోను మార్ఫింగ్ చేశాడు. అనంతరం దాన్ని ట్వీట్ చేశాడు. దానికి సమంత కూడా రియాక్ట్ అయింది. ఆమె పడి పడి నవ్వినట్లు ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. అంతేకాదు ఈ మూవీలో నటిస్తున్న వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో వారి ఫొటోలను కూడా విజయ్ ఇందులో మార్ఫింగ్ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్గా మారింది. మీడియాకు భలే చురకలు అంటించారు.. అని విజయ్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…