Vijay Devarakonda : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలో ఈ ఏడాదిలో వరుసగా విడుదల కానున్నాయి. అయితే అంత బిజీగా ఉంటూ కూడా సమంత వెకేషన్లలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె థాయ్లాండ్ లో విహరిస్తోంది. అక్కడి ఓ రెస్టారెంట్లో గ్లామరస్గా దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే సమంతకు చెందిన ఓ ఫొటోను విజయ్ దేవరకొండ మార్ఫింగ్ చేసి ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఫొటో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
విజయ్ దేవరకొండ, సమంత.. హీరో హీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ పూజ కార్యక్రమానికి హీరోయిన్ సమంత హాజరు కాలేదు. ఆమె వెకేషన్లో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. దీంతో లోకులు పలు కాకులు అన్నట్లు మీడియా మొత్తం కోడై కూసింది. అసలు ఆమె పూజకు ఎందుకు వెళ్లలేదు.. హీరోయిన్గా అంత పొగరు పెరిగిపోయిందా.. పూజ కార్యక్రమానికి కూడా హాజరు కానంత బిజీ అయిందా.. అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే అన్నింటికీ చెక్ పెట్టేలా విజయ్ ఓ ఫొటోను షేర్ చేశాడు.
పూజ కార్యక్రమానికి చెందిన ఫొటోలో సమంతను చేర్చి విజయ్ ఆ ఫొటోను మార్ఫింగ్ చేశాడు. అనంతరం దాన్ని ట్వీట్ చేశాడు. దానికి సమంత కూడా రియాక్ట్ అయింది. ఆమె పడి పడి నవ్వినట్లు ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. అంతేకాదు ఈ మూవీలో నటిస్తున్న వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో వారి ఫొటోలను కూడా విజయ్ ఇందులో మార్ఫింగ్ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్గా మారింది. మీడియాకు భలే చురకలు అంటించారు.. అని విజయ్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…