Hari Hara Veera Mallu : పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ.. హరి హర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో పవన్ బందిపోటు దొంగ పాత్రలో నటిస్తున్నారు. దీంతోఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అయితే కరోనా ప్రభావం తగ్గాక ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినా.. ఇప్పటి వరకు కేవలం ఫస్టాఫ్ను మాత్రమే షూటింగ్ చేశారు. అది కూడా కొన్ని సీన్లు పవన్కు నచ్చలేదట. దీంతో వాటికి మార్పులు చేయాలని క్రిష్కు పవన్ సూచించారట.
అయితే క్రిష్ ఆ సీన్లలో మార్పులు చేసేందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో హరి హర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది. ఆ మార్పులు చేసేవరకు తాను షూటింగ్లో పాల్గొనబోనని పవన్ కచ్చితంగా చెప్పేశారట. దీంతో ఈ మూవీ సందిగ్దంలో పడిపోయింది. మరోవైపు అక్టోబర్ నుంచి పవన్ 6 నెలల పాటు బస్సు యాత్ర చేస్తారు. తరువాత ఎన్నికల హడావిడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ అటకెక్కినట్లే అని ప్రచారం జరిగింది. దీంతో ఆందోళన చెందిన నిర్మాత ఏఎం రత్నం ఇద్దరికీ సయోధ్య కుదిర్చే పనిలో పడ్డారు. ఆయన విజయవంతం అయినట్లు కూడా తెలుస్తోంది. హరి హర వీరమల్లు విషయంలో పవన్ చెప్పిన మార్పులు చేసేందుకు క్రిష్ అంగీకరించేలా రత్నం ఒత్తిడి తెచ్చారట. దీంతో క్రిష్ ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే మూవీ షూటింగ్కు పవన్ అక్టోబర్ వరకు మాత్రమే సమయం ఇచ్చారని తెలుస్తోంది. ఆ లోపు ఇంత పెద్ద మూవీని షూటింగ్ పూర్తి చేయడం అవుతుందా.. అని సందేహాలు వస్తున్నాయి. అయినప్పటికీ నిర్మాత ఏఎం రత్నం ఎలాగో మూవీని పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారట. అలా జరిగితే ఇప్పటి వరకు వచ్చిన నష్టాన్ని కాస్తయినా భర్తీ చేసుకోవచ్చు. అలా కాకుండా మూవీ షూటింగ్ ఇంకా ఆలస్యం అయితే సినిమాకు ఇంకా ఎక్కువగానే నష్టం వస్తుంది. కనుక రత్నం.. క్రిష్, పవన్లతో మాట్లాడి వారికి సయోధ్యను కుదిర్చారని తెలుస్తోంది. దీంతో మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఇది పవన్ అభిమానులకు నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు.
ఇక హరి హర వీరమల్లుతోపాటు వినోదయ సీతమ్ అనే మూవీ రీమేక్ను కూడా పవన్ ఇదే సమయంలో పూర్తి చేయాలని చూస్తున్నారట. మరి రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి అవుతుందా.. కాదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఇక హరి హర వీరమల్లుకు బెన్ లాక్ గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఈయన ఆక్వామాన్, స్టార్ వార్స్ వంటి హాలీవుడ్ మూవీలకు గ్రాఫిక్స్ చేశారు. దీంతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ను ఇందులో చూసేందుకు అవకాశం లభించనుంది. ఇక నిధి అగర్వాల్తోపాటు బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు అర్జున్ రామ్ పాల్ కూడా ఈ మూవీలో కీలకపాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…