Samantha : ఏమాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సమంత సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే హీరోయిన్స్లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుందామె. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది.
టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోయి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. డివోర్స్ అనంతరం సమంత వ్యక్తిగత ట్రోలింగ్ కి గురైంది. విడాకుల గురించి ఇద్దరూ డైరెక్టుగా స్పందించనప్పటికీ సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఇటీవల సమంత కాఫీ విత్ కరణ్ షోలో.. నాగచైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
మా విడాకులు ప్రశాంతంగా జరగలేదు అంటూ బాంబ్ పేల్చిన సమంత.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుధాలను దూరం పెట్టాలి అంటూ కామెంట్ చేసింది. ఈ మాటలు అక్కినేని ఫ్యాన్స్ కి నచ్చక కోపంతో ఊగిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉంటోంది. అయితే ఆమె మళ్లీ ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే పుష్పతో ఓ ఊపు ఊపేసిన సమంత.. మరోసారి ఆ స్టైల్ తో ఆ హాట్ నెస్ తో ఐటమ్ సాంగ్ చేస్తే తట్టుకోలేము రా బాబు అంటూ ఫ్యాన్స్ బాధపడ్డారు.
ఈ లిస్టులో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సమంత ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదని తెలుస్తోంది. అంతేకాదు ఇకపై భవిష్యత్తులో కూడా ఐటమ్ సాంగ్ చేయనని తన దగ్గరకు వచ్చిన దర్శకులకు కచ్చితంగా చెప్పేసిందట. దీంతో ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంతని మేము హీరోయిన్ గానే చూడాలనుకుంటున్నామని, ఐటెం గర్ల్ గా కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ నిర్ణయానికి ఆమె ఎప్పటికీ కట్టుబడి ఉంటుందో.. తాత్కాలికమో.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…