Samantha : ఏమాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సమంత సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే హీరోయిన్స్లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుందామె. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది.
టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోయి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. డివోర్స్ అనంతరం సమంత వ్యక్తిగత ట్రోలింగ్ కి గురైంది. విడాకుల గురించి ఇద్దరూ డైరెక్టుగా స్పందించనప్పటికీ సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఇటీవల సమంత కాఫీ విత్ కరణ్ షోలో.. నాగచైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
మా విడాకులు ప్రశాంతంగా జరగలేదు అంటూ బాంబ్ పేల్చిన సమంత.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుధాలను దూరం పెట్టాలి అంటూ కామెంట్ చేసింది. ఈ మాటలు అక్కినేని ఫ్యాన్స్ కి నచ్చక కోపంతో ఊగిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉంటోంది. అయితే ఆమె మళ్లీ ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే పుష్పతో ఓ ఊపు ఊపేసిన సమంత.. మరోసారి ఆ స్టైల్ తో ఆ హాట్ నెస్ తో ఐటమ్ సాంగ్ చేస్తే తట్టుకోలేము రా బాబు అంటూ ఫ్యాన్స్ బాధపడ్డారు.
ఈ లిస్టులో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సమంత ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదని తెలుస్తోంది. అంతేకాదు ఇకపై భవిష్యత్తులో కూడా ఐటమ్ సాంగ్ చేయనని తన దగ్గరకు వచ్చిన దర్శకులకు కచ్చితంగా చెప్పేసిందట. దీంతో ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంతని మేము హీరోయిన్ గానే చూడాలనుకుంటున్నామని, ఐటెం గర్ల్ గా కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ నిర్ణయానికి ఆమె ఎప్పటికీ కట్టుబడి ఉంటుందో.. తాత్కాలికమో.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…