Samantha : సంచలన నిర్ణయం తీసుకున్న సమంత.. ఖుషి అవుతున్న అక్కినేని ఫ్యాన్స్..

August 27, 2022 8:57 AM

Samantha : ఏమాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సమంత సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్‌ మీడియాలో సూపర్‌ యా​క్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుందామె. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది.

టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోయి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. డివోర్స్ అనంతరం స‌మంత‌ వ్యక్తిగత ట్రోలింగ్ కి గురైంది. విడాకుల గురించి ఇద్దరూ డైరెక్టుగా స్పందించనప్పటికీ సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఇటీవల సమంత కాఫీ విత్ కరణ్ షోలో.. నాగచైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Samantha took important decision Akkineni fans happy
Samantha

మా విడాకులు ప్రశాంతంగా జరగలేదు అంటూ బాంబ్ పేల్చిన స‌మంత‌.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే పదునైన‌ ఆయుధాలను దూరం పెట్టాలి అంటూ కామెంట్ చేసింది. ఈ మాటలు అక్కినేని ఫ్యాన్స్ కి నచ్చక కోపంతో ఊగిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉంటోంది. అయితే ఆమె మళ్లీ ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే పుష్పతో ఓ ఊపు ఊపేసిన సమంత.. మరోసారి ఆ స్టైల్ తో ఆ హాట్ నెస్ తో ఐటమ్ సాంగ్ చేస్తే తట్టుకోలేము రా బాబు అంటూ ఫ్యాన్స్ బాధపడ్డారు.

ఈ లిస్టులో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సమంత ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదని తెలుస్తోంది. అంతేకాదు ఇకపై భవిష్యత్తులో కూడా ఐటమ్ సాంగ్ చేయనని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ద‌ర్శ‌కుల‌కు కచ్చితంగా చెప్పేసింద‌ట. దీంతో ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంతని మేము హీరోయిన్ గానే చూడాలనుకుంటున్నామని, ఐటెం గర్ల్ గా కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌ ఈ నిర్ణయానికి ఆమె ఎప్పటికీ కట్టుబడి ఉంటుందో.. తాత్కాలికమో.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment