Samantha : అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంత జోరు పెంచింది. వరుస సినిమాలకు ఓకే చెబుతోంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో సమంతకు ఐటమ్ సాంగ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. అనే తేడా లేకుండా సమంత తనకు వచ్చిన ప్రతి ఆఫర్కు ఓకే చెబుతోంది. ఓ వైపు సినిమాలు.. మరో వైపు ఐటమ్ సాంగ్స్.. మధ్య మధ్యలో బ్రాండ్ల ప్రమోషన్ల పోస్టులు.. వెకేషన్లు.. ఇలా సమంత ఫుల్ బిజీగా మారింది. అలాగే వెబ్ సిరీస్లలోనూ నటిస్తోంది. ఇక తాజాగా సమంత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్లో సమంతకు ఓ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో కార్తీ పక్కన సమంతను హీరోయిన్గా ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సమంత సదరు సినిమా నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి తమిళ మూవీ బ్యాచిలర్ ఫేమ్.. సతీష్ సెల్వకుమార్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఓకే చెబితే.. వెంటనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇందులో కార్తీ పక్కన సమంత నటిస్తుందని అంటున్నారు. ఆమెకు ఈ ఆఫర్కు ఓకే చెప్పిందని కూడా సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయంపై అధికారికంగా త్వరలోనే వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇక సమంత ప్రస్తుతం యశోద అనే సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే మూవీని సమంత ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
అలాగే ఓ బాలీవుడ్, మరో హాలీవుడ్ సినిమాలోనూ సమంత నటించనుంది. మరో వెబ్ సిరీస్లో నటించేందుకు కూడా ఈమె సిద్ధమవుతోంది. ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలో సమంతకు ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారు. మొత్తంగా చూస్తే సమంత విడాకుల తరువాతే ఫుల్ బిజీగా మారిందని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…