Samantha : ఒకప్పుడు స్టార్ హీరోలు మాత్రమే కొన్ని కండిషన్స్ పెట్టేవారు. ఇప్పుడలా కాదు.. కొందరు కథానాయికలు కూడా నిర్మాతలకు కండిషన్స్ పెట్టి వారిని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఈ లిస్ట్లో అక్కినేని మాజీ కోడలు సమంత కూడా చేరింది. విడాకుల తర్వాత సమంత సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే.
రీసెంట్గా సమంతకి సంబంధించిన రెండు సినిమాలపై అనౌన్స్మెంట్ వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న 30వ సినిమాలో సమంత నటించబోతుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శాంతరూబన్ జ్ఞానశేఖరన్ తెరకెక్కించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంలోనూ సమంత నటించనుంది.
ఈ చిత్రానికి హరి, హరీశ్ సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. వీరికి ఇదే తొలి సినిమా. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర టీమ్ వెల్లడించింది. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ ద్విభాషా చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసిన సమంత తన తదుపరి చిత్రాల నిర్మాతలకు కొత్త షరతులు పెడుతోంది.
షూటింగ్ ల కోసం మెజారిటీ పార్ట్ చెన్నై లేదా ఆ చుట్టుపక్కల లొకేషన్లను ఎంచుకోవాలని సమంత దర్శక నిర్మాతలను కోరుతుందట. హైదరాబాద్ లో షూటింగులు చేయడానికి ఆమె ఇష్టపడడంలేదు. ఒకవేళ హైదరాబాద్లో తప్పనిసరిగా చిత్రీకరించాలనుకుంటే కేవలం ఇండోర్ మాత్రమే ప్లాన్ చేయాలి. ఇండోర్ లొకేషన్లు సెట్లలో షూట్ చేయాలి. ఆరు బయట షూటింగ్ వద్దు అని ప్రత్యేకమైన కండిషన్స్ పెడుతోందట. మరి వాటికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…