Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ తోపాటు రియల్ లైఫ్ లోనూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన జంట సమంత, నాగచైతన్య. ముచ్చటగా ఉండే ఈ జంట విడాకుల తర్వాత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో చాలా మార్పులే వచ్చాయి. మొదట సమంత అక్కినేని నుండి అక్కినేని అనే పేరుని తీసేసింది. ఆ తర్వాత సమంత పేరుతోనే కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్ గా కూడా సమంత ఆధ్యాత్మికంగా తీర్థయాత్ర కంప్లీట్ చేసుకుని, తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకుంది.
అయితే వీరిద్దరి విడాకుల తర్వాత నాగచైతన్య ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ని సామ్ ఫాలో అవుతూనే ఉంది. అలాగే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి చైతూతో కలిసి ఉన్న ఫోటోల్ని సుమారు 80 కు పైగా ఫోటోస్ ని డిలీట్ చేసింది. కేవలం వీరిద్దరూ కలిసున్న ఫోటోస్ ని మాత్రమే సామ్ డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. మరి నాగచైతన్యను ఫాలో అవుతున్న సామ్ త్వరలో అన్ ఫాల్ చేస్తుందేమో చూడాలి. లేటెస్ట్ గా సమంత తన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ లతో ఉన్న ఓ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. రీసెంట్ గా శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రను ఫినిష్ చేసుకుంది.
లేటెస్ట్ గా సామ్ ఓ పోస్ట్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిల్ని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పెంచాలని.. భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన పోస్ట్ ను షేర్ చేసంది. మీ కూతుర్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారనేది ఆలోచించకుండా ఆమెను మరింత శక్తివంతంగా మార్చండి. ఆడపిల్ల పెళ్ళి కోసం దాచే డబ్బుల్ని ఆమె ఎడ్యుకేషన్ కి ఖర్చు పెట్టండి. అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ తోపాటు ఆత్మస్థైర్యంతో భయపడకుండా నిలబడగలిగేలా బ్రతికేలా నేర్పాలని తన పోస్ట్ లో తెలిపింది. ప్రజంట్ నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. సమంత శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మరో పక్క కోలీవుడ్ లో తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటోంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…