Samantha : తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించారంటూ స్టార్ హీరోయిన్ సమంత కోర్టులో కొన్ని యూట్యూబ్ చానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలుసార్లు విచారణ అనంతరం ఎట్టకేలకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ తీర్పు సమంతకు ఊరట కలిగించేదే. అయినప్పటికీ ఆమె కూడా కోర్టు సూచనలను పాటించాల్సి ఉంటుంది.
కాగా సమంతపై ప్రసారం చేసిన వీడియోల తాలూకు యూట్యూబ్ లింక్లను వెంటనే డిలీట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితానికి చెందిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయరాదని, కామెంట్స్ చేయరాదని.. ఇంజెక్షన్ ఆర్డర్ను పాస్ చేసింది. ఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ విషయాల జోలికి వెళ్లకూడదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అయితే సమంత తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ కోర్టు ఆమెకు సూచించింది. సమంత తరఫున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.
కాగా నాగచైతన్యతో విడాకులు అని ప్రకటించినప్పటి నుంచి సమంతను తీవ్రంగా ట్రోల్ చేశారు. కొన్ని చానల్స్ అయితే లేని పోని ఆరోపణలు చేశారు. తప్పంతా ఆమెదేనన్నట్లు చూపించారు. దీంతో మనస్థాపం చెందిన సమంత కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి పలు సార్లు కేసు విచారణను వాయిదా వేసి ఎట్టకేలకు తీర్పు చెప్పారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…