Samantha : తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించారంటూ స్టార్ హీరోయిన్ సమంత కోర్టులో కొన్ని యూట్యూబ్ చానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలుసార్లు విచారణ అనంతరం ఎట్టకేలకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ తీర్పు సమంతకు ఊరట కలిగించేదే. అయినప్పటికీ ఆమె కూడా కోర్టు సూచనలను పాటించాల్సి ఉంటుంది.
కాగా సమంతపై ప్రసారం చేసిన వీడియోల తాలూకు యూట్యూబ్ లింక్లను వెంటనే డిలీట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితానికి చెందిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయరాదని, కామెంట్స్ చేయరాదని.. ఇంజెక్షన్ ఆర్డర్ను పాస్ చేసింది. ఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ విషయాల జోలికి వెళ్లకూడదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అయితే సమంత తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ కోర్టు ఆమెకు సూచించింది. సమంత తరఫున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.
కాగా నాగచైతన్యతో విడాకులు అని ప్రకటించినప్పటి నుంచి సమంతను తీవ్రంగా ట్రోల్ చేశారు. కొన్ని చానల్స్ అయితే లేని పోని ఆరోపణలు చేశారు. తప్పంతా ఆమెదేనన్నట్లు చూపించారు. దీంతో మనస్థాపం చెందిన సమంత కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి పలు సార్లు కేసు విచారణను వాయిదా వేసి ఎట్టకేలకు తీర్పు చెప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…