Samantha : స్టైలిష్ స్టార్గా అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అయ్యాడో, ఆయన సతీమణి స్నేహా రెడ్డి కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంటోంది. అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. హీరోల సతీమణుల్లో కెల్లా అల్లు స్నేహారెడ్డికి ఆ మధ్య అరుదైన గుర్తింపు లభించింది. మొత్తం సెలబ్రిటీల భార్యల్లో అల్లు స్నేహారెడ్డికి మాత్రమే ఎక్కువ మంది ఫాలోవర్లున్నారు.
నాలుగు మిలియన్ల ఫాలోవర్లతో టాప్లో నిలిచిన స్నేహారెడ్డి.. నమ్రత, ఉపాసన వంటి వారిని సైతం వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ ఉండే స్నేహ రెడ్డి తాజగా బ్లాక్ శారీలో దిగిన ఒక ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనికి ‘వేరింగ్ ఆల్ బ్లాక్’ అనే కేప్షన్ కూడా ఇచ్చారు.
మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆ శారీకి జుకాల్కర్ స్టైలింగ్ ను యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోకి సమంత కూడా తన కామెంట్ ను యాడ్ చేసింది. ‘హాట్’ అని కామెంట్ చేసి.. దాని పక్కన ఫైర్ ఎమోజీని పెట్టింది. దీంతో ఈ పిక్ మరింతగా వైరల్ అవుతోంది. కాగా, స్నేహా రెడ్డి భర్త బన్నీ నటించిన పుష్పలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…