Sai Pallavi : సాయిపల్లవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటిగానే కాక తన వ్యక్తిత్వం పరంగా కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్కు చెందిన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయాలని చెప్పి.. రూ.కోట్లు ఇస్తామని ఈమె దగ్గరకు వచ్చాయి. అయినప్పటికీ తాను సహజసిద్ధమైన అందాన్నే ఇష్టపడతానని.. కనుక అలాంటి ప్రొడక్ట్స్ను ప్రచారం చేయలేనని చెప్పేసింది. ఇక ఇటీవలే మరో కంపెనీకి చెందిన భారీ ఆఫర్ను కూడా ఈమె సున్నితంగా తిరస్కరించింది. అయితే సాయిపల్లవికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. కానీ వచ్చిన వాటిని కూడా ఆమె సద్వినియోగం చేసుకోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే సినిమాల ఎంపికలోనూ సాయిపల్లవి జాగ్రత్త పడడం లేదని అంటున్నారు.
సాయి పల్లవి నటించిన విరాట పర్వం మూవీ వాస్తవానికి ఈ తరం చూసేదికాదు. ఇలాంటి సినిమాలను ఇప్పుడు ప్రేక్షకులు చూడడం లేదు. అలాగే ఈమె నటించిన గార్గి అనే మరో మూవీ కూడా త్వరలో రిలీజ్ అవుతోంది. ఇది కోర్టుల నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. ఇందులో కులాలు, వివక్ష మీద చూపిస్తారట. అయితే ఇలా సాయి పల్లవి సినిమా సెలెక్షన్లోనూ తప్పు చేస్తుందని అంటున్నారు. విరాట పర్వం లాంటి సినిమానే గార్గి అని.. ఈ తరహా సినిమాలను ప్రేక్షకులు చూడడం లేదని.. ఈమె సినిమాల ఎంపికపై మరింత శ్రద్ధ వహించాలని అంటున్నారు.
సాయిపల్లవి ఒక రకంగా ఇలాంటి సినిమాలను చేస్తుండడం ద్వారా తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటుందని అంటున్నారు. హీరోయిన్లు కమర్షియల్ ధోరణిలో ఆలోచించాలని.. సినిమాల ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే కెరీర్ పతనం అవుతుందని.. సాయిపల్లవి కెరీర్ ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉందని.. ఇకనైనా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుని చేయకపోతే.. ఆమె కెరీర్ ఇంతటితోనే ముగుస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా.. ఒక రకంగా చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తోంది. సాయిపల్లవి గ్లామర్ షో చేయడంలో హద్దులు పెట్టుకుంది. కరెక్టే. కానీ సినిమాల విషయంలో అయినా సరే కాస్త పట్టు విడుపులు ఉండాలి. లేదంటే తోటి హీరోయిన్లతో ఈ కాలంలో పోటీ పడడం కష్టమే. మరి ముందు ముందు ఆమె ఎలాంటి సినిమాలను చేస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…