Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్తో హాస్పిటల్లో చేరి అక్కడ చికిత్స తీసుకుని కోలుకున్న తరువాత చాలా రోజుల పాటు బయటి ప్రపంచానికి కనిపించలేదు. ఆ తరువాత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయట కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో పవన్ కల్యాణ్ సినిమాలో తేజ్ ఒక గెస్ట్ రోల్ చేయనున్నాడు. ఆ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఇక సాయి ధరమ్ తేజ్ గతంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో మళ్లీ అందులో యాక్టివ్ అయ్యాడు. ఇక ఇటీవలే ఆయన సర్కారు వారి పాట సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
సర్కారు వారి పాట మూవీ రిలీజ్కు ముందు చిత్ర యూనిట్కు సాయి ధరమ్ తేజ్ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు మరోమారు ఇంకో హీరో మూవీకి కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి లేటెస్ట్గా చేసిన 777 చార్లి అనే మూవీపై తేజ్ స్పందించారు. ఈ క్రమంలోనే ఈ మూవీపై తేజ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ఈ మూవీ ట్రైలర్ను చూసిన తేజ్ స్పందిస్తూ.. నా హృదయం బరువెక్కింది.. ఆ ట్రైలర్ నన్ను కదిలించింది.. నా మనస్సు చలించింది.. సోదరా రక్షిత్ శెట్టి.. నీ మీద నాకు గౌరవం పెరిగింది.. ఈ సినిమాను మనకు అందిస్తున్న రానాకు థ్యాంక్స్.. అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తరువాత సాయి ధరమ్ తేజ్ ఇలా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా మారడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక 777 చార్లి అనే మూవీ విషయానికి వస్తే.. ఇందులో హీరోకు, కుక్కకు మధ్య జరిగే కథను చాలా ఎమోషనల్గా చూపించారు. దీంతో ఇది అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…