Sai Dharam Tej : మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఈయన చివరిసారిగా మనకు రిపబ్లిక్ మూవీ ద్వారా తెరపై కనిపించారు. తరువాత యాక్సిడెంట్ కారణంగా అనేక రోజుల పాటు హాస్పిటల్కే పరిమితం అయ్యారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా తేజ్ బయట మీడియాకు కనిపించేందుకు చాలా రోజుల సమయమే తీసుకున్నాడు. ఇక ఇటీవల వినోదయ సీతం అనే సినిమా ద్వారా మళ్లీ షూటింగ్ను ప్రారంభించేశాడు. అయితే ఈ మూవీలో పవన్ దే కీలక రోల్. కనుక ఇది పవన్ సినిమానే అని చెప్పవచ్చు. తేజ్ది కేవలం సహాయక పాత్ర మాత్రమే. కనుక తేజ్కు ఇది మెయిన్ మూవీ కాదు. ఈ క్రమంలోనే తేజ్ తాను హీరోగా స్ట్రెయిట్ సినిమాను ఎప్పుడు చేస్తారా ? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తేజ్ ఇతర మెగా హీరోలకు భిన్నం. డిఫరెంట్ జోనర్లు, కథలను చేయడంలో దిట్ట. అలా చేసిన మూవీలు హిట్ అయ్యాయి కూడా. అయితే యాక్సిడెంట్ వల్లనో ఏమో తెలియదు కానీ.. తేజ్ చాలా డల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ మంచి ఫామ్లోకి రావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అదే పాత ధోరణితో తీసిన ఆచార్య మూవీ ఫెయిల్ కావడంతో తేజ్ అలాంటి తప్పు చేయవద్దని.. పాత స్టోరీలతో సినిమా తీయవద్దని.. తీస్తే గుణపాఠం అవుతుందని అంటున్నారు. భిన్నమైన కాన్సెప్ట్తో కూడిన కథలను ఎంచుకుని సినిమాలను తీయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ప్రస్తుత తరుణంలో సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, విశ్వక్సేన్ లాంటి వారు తమదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అలా తేజ్ చేయాలని.. లేదంటే కెరీర్లో ముందుకు సాగడం కష్టమే అవుతుందని అంటున్నారు. మరి తేజ్ తన సొంత చిత్రం ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…