Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఇలా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయిధరమ్ తేజ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించారు. నెల రోజుల పాటు ఈయన ఆస్పత్రిలో బెడ్ కి పరిమితం కావడంతో మెగా కుటుంబంతోపాటు అభిమానులు అందరూ ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సాయిధరమ్ తేజ్ తిరిగి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తున్నారు.
ప్రమాదం తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత నన్ను కాపాడిన సయ్యద్ అబ్దుల్ ఫహాద్ కు చాలా కృతజ్ఞతలు, నీకున్న మానవత్వంతోననే నేను బతికి ఉన్నాను అంటూ అతని గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అదే విధంగా నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను అంటే ఆ మూడు కుటుంబాలే కారణమని, జీవితాంతం ఆ మూడు కుటుంబాలకి రుణపడి ఉంటాను.. అంటూ సాయి తేజ్ వెల్లడించారు.
ఆ మూడు కుటుంబాలలో మొదటి కుటుంబం మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నానని తెలిపారు. ఇక రెండో కుటుంబంగా భావించే చిత్రపరిశ్రమకు తాను రుణపడి ఉన్నాను, ఈ విషయం తెలియగానే ఎంతోమంది నా గురించి ఆరా తీస్తూ నేను క్షేమంగా రావాలని కోరుకున్నారు. ఇక అభిమానులను మూడవ కుటుంబంగా భావిస్తూ.. నా క్షేమం కోరిన అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని.. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇక తన తరువాతి సినిమా షూటింగ్ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని కూడా తేజ్ వెల్లడించారు. ఎట్టకేలకు తేజ్ ఆరోగ్యంగా కనిపిస్తుండడం.. మళ్లీ సినిమాలు చేయనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…