Sada : సదా.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణీలో మెరుస్తూ కుర్ర హృదయాలను దోచుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సదాకు వరుస అవకాశాలు వచ్చాయి. సదా కెరీర్లో జయంతోపాటు అపరిచితుడు సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆమెకు ఆఫర్లు రాలేదు. దీంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది.
బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యహరిస్తునే మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్ చేసింది. తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ఫామ్ లోకి సదా వచ్చింది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన రిపోర్టర్ తో సదా చెప్పిన సమాధానం మైండ్ బ్లాకింగ్ గా ఉంది. సదా మాట్లాడుతూ.. ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో 10 మంది పెళ్లి చేసుకుంటే 5 మంది మాత్రమే కలిసున్నారని.. మిగతా 5 మంది విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ పరోక్షంగా సమంత, చైతన్య విడాకులపై ముడిపడి ఉండడం గమనార్హం. అంతేకాదు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా సదా చెప్పుకొచ్చింది.
నా జీవితం నా చేతుల్లోనే ఉంది. నా లైఫ్ నేను చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాను. పార్టీలకు, పబ్బులకు వెళ్ళను. నా జీవితం నాకు నచ్చినట్లే బ్రతకాలనుకుంటున్నాను. ఎవరో వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించాలని అనుకోను. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటేరియన్ ఉండాలని కోరుకుంటున్నాను. డబ్బు లేకపోయినా ఫర్లేదు.. కానీ మంచి మనసు ఉండాలి. నాపై నా డబ్బుపై ఆధార పడకూడదు అంటూ చెప్పుకొచ్చింది సదా. దీంతో నెటిజన్స్ కూడా సదాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన దాంట్లో తప్పు లేదంటూ ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ స్టైల్ అలాగే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…