Radhe Shyam : బాహుబలి, సాహో సినిమాల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్, పూజ హెగ్డె జంటగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్, పూజాహెగ్డె రాధేశ్యామ్ చిత్రానికి ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకొని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సరికొత్త ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్ల వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోషల్ మీడియాను ఉపయోగించుకొని తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా క్రేజ్ ను ఉపయోగించుకొని ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అని తెలియజెప్పేలా ట్వీట్ చేశారు. రాధేశ్యామ్ సినిమా పోస్టర్ తో ఉన్న ఈ మీమ్ విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇంతకీ ఈ పోస్టర్ లో ఏముందనే విషయానికి వస్తే.. ప్రభాస్, పూజ హెగ్డె ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా రోజుల తరువాత కనీసం ఏదైనా టూర్ వెళ్దాం అంటూ ప్రభాస్ ప్లాన్ చేస్తాడు. అందుకు పూజా హెగ్డె.. వెళ్దాం.. కానీ ఆర్టీసీలోనే వెళ్దాం.. అంటూ చెప్పుకొచ్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో సురక్షితం అంటూ పూజా హెగ్డె చెప్పింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ ట్వీట్ పై స్పందిస్తూ సజ్జనార్ ఐడియా మామూలుగా లేదుగా.. అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేయగా, మరికొందరు సజ్జనార్ ఆర్టీసీ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చేస్తున్న ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…