RRR : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇక గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ప్రతి ఒక్క నటి, నటుడు ఎంతో కష్టపడి పని చేశారు.
వీరి కష్టం మొత్తం ఇప్పటికే పలు రకాలుగా ప్రేక్షకులకు చూపించారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఆలియా భట్, నటి శ్రియ, అజయ్ దేవగన్ వంటి పలువురు స్టార్ సెలబ్రెటీలు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో ఈ నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎవరు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు.. అనే విషయానికి వస్తే..
డీవీవీ దానయ్య ఈ సినిమాను సుమారుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ చెరో రూ.45 కోట్ల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. ఇక సీత పాత్ర ద్వారా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతోంది. ఈ సినిమా కోసం ఆలియాభట్ ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అజయ్ దేవగన్కు రూ.25 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ సినిమా లాభాలలో 30 శాతం వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…