Roja : నటి, జబర్దస్త్ జడ్జి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే. రాజేంద్రప్రసాద్ తో కలిసి ప్రేమ తపస్సు అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన రోజా.. సీతారత్నంగారి అబ్బాయితో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు రోజా.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. రోజా ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెంబురతి మూవీతో రోజా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీని సెల్వమణినే తెరకెక్కించారు. ఈ సినిమా సమయంలోనే సెల్వమణి, రోజాల మధ్య స్నేహం ఏర్పడగా.. ఆ స్నేహం ప్రేమకు దారి తీసింది. అయితే సెల్వమణి తాను ప్రేమిస్తున్న విషయాన్ని మొదట రోజాకు కాకుండా.. ఆమె తల్లిదండ్రులకు చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న రోజా.. మొదట షాక్ అయినా ఆ తర్వాత సెల్వమణితో పెళ్లికి ఒకే చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రోజా ఓకే చెప్పాక సెల్వమణిని ఆమె పెళ్లి చేసుకోవడానికి 11 ఏళ్లు పట్టిందట.
ఈ ఆలస్యానికి కారణమేంటంటే.. తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా అన్నదమ్ములు వారి కెరీర్ లను వదిలిపెట్టి ఈమెతో ఉండిపోయారట. అందుకే ఒక సినిమా తీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో వారిని సెటిల్ చేయాలని భావించిందట రోజా. అందులో భాగంగానే సమరం అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయట. రోజా అనేక సార్లు షూటింగ్ లో గాయపడింది. ఎలాగోలా ఈ సినిమా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అలా ఈ చిత్రం ద్వారా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు రోజా మరికొంత కాలం చిత్రాలు చేయాల్సి వచ్చింది.
ఇలా అనుకోని సంఘటనలు వీరి వివాహాన్ని వాయిదా వేశాయి. చివరకు రోజా, సెల్వమణిలు 2002లో పెళ్లి చేసుకోగా.. వీరికి కూతురు అన్షు మాలిక, కొడుకు కృష్ణ లోహిత్ జన్మించారు. సినిమాలకు కొంత విరామం తర్వాత రోజా.. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కార్యక్రమాలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్నారు రోజా.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…