RGV : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అంతటా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొన్నటి వరకు పవన్-వైసీపీ మధ్య భీకర యుద్ధం జరగగా, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న చందాన మారింది. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా చంద్రబాబు నిరసన చేపట్టారు.
తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టీడీపీ నేతలు దూషించారంటూ వైసీపీ శ్రేణులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. మరోవైపు టీడీపీ శ్రేణులు తమ వర్షెన్ తాము చెబుతున్నాయి. అయితే ప్రతి విషయంలోనూ తనదైన స్టైల్లో స్పందించే వర్మ ఏపీ రాజకీయాలపై కూడా ట్వీట్ చేశారు.
‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. బాక్సింగ్ నేర్చుకుంటే ఒకరికొకరు మంచిగా ఫైట్ చేసుకోవచ్చనే అభిప్రాయంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై కూడా వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమావాళ్లను సర్కస్ అంటూ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…