RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంటారు. ఆయన చేసే సంచలన ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అలాగే లోకల్ నుండి ఇంటర్నేషనల్ పొలిటిషియన్స్ వరకు వర్మ ట్వీట్స్ రచ్చ సాగుతూనే ఉంటుంది. ఇటీవల బాలీవుడ్ కు మండిపోయే ప్రశ్నను వర్మ సంధించారు. దక్షిణాది సినిమాలు హిందీలో సైతం విడుదలవుతూ భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన సినిమాలను ప్రశంసిస్తూ.. హిందీ సినిమాలను తక్కువ చేసేలా వర్మ ట్వీట్ చేశారు.
ఇక తాజాగా ఆచార్య సినిమా స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్పై తనదైన శైలిలో అస్త్రాలు సంధించారు. ఆచార్య ప్రమోషన్ వీడియోను వాడేస్తూ తండ్రీ కొడుకుల గాలి తుస్సుమనిపించారు. ఆచార్య నుంచి విడుదల చేసిన ఆ వీడియోలో.. నువ్వు నన్ను డామినేట్ చేస్తావా.. అంటూ చిరంజీవి- రామ్ చరణ్ మధ్య నడిచిన సంభాషణ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోని షేర్ చేసిన వర్మ.. తండ్రి, కొడకులపై సెటైర్స్ వేశారు. తగ్గను.. తగ్గను.. అంటూ అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్స్తో మెగా ఫాదర్, మెగా సన్ అనుకుంటూ ఉండటం చూసి నేను మెగా హర్ట్ అయ్యాను. ఇక్కడ బన్నీ డైలాగులు వాడటం చూస్తుంటే న్యూ మెగా హీరో అల్లు అర్జునే అని రామ్ చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది.. అని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా విజయవాడలో ఒక ప్రముఖ కళాశాలలో జరుగుతుంది.. అంటూ ప్రచారం మొదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్, పూజ హెగ్డె హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోనా సహా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…