Redmi 6A : ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మన దినచర్యలో భాగం అయిపోయాయి. మనం ఏ పని చేస్తున్నా సరే ఫోన్ మన వెంటే ఉంటోంది. అందులో అనేక పనులను చక్కబెట్టుకుంటున్నాం. అలాగే వినోదాన్ని కూడా పొందుతున్నాం. అయితే కొన్ని సార్లు పలు కంపెనీలకు చెందిన ఫోన్లు పేలుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 6ఎ ఫోన్ పేలింది. దీంతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో నివాసం ఉండే మన్జిత్ అనే వ్యక్తి బంధువు ఒక మహిళ రాత్రి పూట రెడ్మీ 6ఎ ఫోన్ను తల దగ్గర పెట్టుకుని నిద్రించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ ఫోన్ పేలింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న ఆ మహిళకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే సదరు మన్జిత్ ఒక యూట్యూబర్ కావడంతో ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. దీంతో స్పందించిన షియోమీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు కస్టమర్ సేఫ్టీ ముఖ్యమని పేర్కొంది. అంతేకాదు.. సంఘటన జరిగిన చోటుకు తాము వెళ్తున్నామని.. అసలు ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలియజేసింది. అయితే గతంలోనూ పలు సంఘటనల్లో షియోమీ ఫోన్లు పేలాయి. కానీ మరీ ఇంత తీవ్రంగా ఎవరైనా మరణించిన దాఖలాలు లేవు. కాగా తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మరోమారు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…