Redmi 6A : ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మన దినచర్యలో భాగం అయిపోయాయి. మనం ఏ పని చేస్తున్నా సరే ఫోన్ మన వెంటే ఉంటోంది. అందులో అనేక పనులను చక్కబెట్టుకుంటున్నాం. అలాగే వినోదాన్ని కూడా పొందుతున్నాం. అయితే కొన్ని సార్లు పలు కంపెనీలకు చెందిన ఫోన్లు పేలుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 6ఎ ఫోన్ పేలింది. దీంతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో నివాసం ఉండే మన్జిత్ అనే వ్యక్తి బంధువు ఒక మహిళ రాత్రి పూట రెడ్మీ 6ఎ ఫోన్ను తల దగ్గర పెట్టుకుని నిద్రించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ ఫోన్ పేలింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న ఆ మహిళకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే సదరు మన్జిత్ ఒక యూట్యూబర్ కావడంతో ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. దీంతో స్పందించిన షియోమీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు కస్టమర్ సేఫ్టీ ముఖ్యమని పేర్కొంది. అంతేకాదు.. సంఘటన జరిగిన చోటుకు తాము వెళ్తున్నామని.. అసలు ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలియజేసింది. అయితే గతంలోనూ పలు సంఘటనల్లో షియోమీ ఫోన్లు పేలాయి. కానీ మరీ ఇంత తీవ్రంగా ఎవరైనా మరణించిన దాఖలాలు లేవు. కాగా తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మరోమారు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…