Rashmika Mandanna : తెలుగు ప్రేక్షకులకు రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో అనే సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలతో ఈమె పాపులర్ అయింది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్గా కూడా మారింది. ప్రస్తుతం ఈమెకు బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక రష్మిక మందన్న కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా.. పలు బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది.
రష్మిక మందన్న వద్ద విలాసవంతమైన కార్లు, దుస్తులు, హ్యాండ్ బ్యాగ్లు, బిల్డింగ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.4 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె ఆస్తులు రూ.80 కోట్ల వరకు ఉంటాయని సమాచారం. వాటిల్లో చాలా వరకు ఖరీదైన కార్లు, ఇళ్లే ఉన్నాయి. ఈమెకు బెంగళూరులో రూ.8 కోట్లు విలువ చేసే ఇల్లు ఒకటి ఉంది. అలాగే ముంబైలోనూ అత్యంత ఖరీదైన ఏరియాలో ఈ మధ్యే ఒక ఇంటిని కొనుగోలు చేసింది.
ఇక రష్మిక మందన్న వద్ద కార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటిల్లో రూ.50 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ కార్, రూ.40 లక్షలు విలువ చేసే ఆడి క్యూ3 కారు, టయోటా ఇన్నోవా, హుండాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే మిషన్ మజ్ను అనే మూవీ షూటింగ్ను పూర్తి చేసింది. అలాగే అమితాబ్ బచ్చన్తో కలిసి గుడ్బై అనే మూవీలో నటిస్తోంది. త్వరలో రామ్ చరణ్తో మూవీ చేయనుంది. పుష్ప 2 షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దుల్కర్ సల్మాన్తో కలిసి సీతా రామమ్ అనే మూవీలో నటిస్తోంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…