Rashmi Gautam : బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోల ద్వారా బోలెడు క్రేజ్ సంపాదించుకుంది రష్మీ గౌతమ్. గతంలో జబర్దస్త్ షోను అనసూయ హోస్ట్ చేస్తుండగా, ఎక్స్ట్రా జబర్దస్త్కి రష్మీ గౌతమ్ యాంకర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీ కావడంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీనే యాంకర్గా చేస్తూ వస్తోంది.
రష్మీ కెరియర్ బిగినింగ్ లో సినిమాల్లో నటించింది. ఆమె చదువు పూర్తి కాగానే సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చేసింది. సినిమా అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేయగా 2011 లో ఒక తమిళ రొమాంటిక్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ లోకి ప్రస్థానం సినిమాలో రష్మీ సపోర్టింగ్ రోల్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హోలీ, థాంక్స్, కరెంట్, బిందాస్, గురు వంటి సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో చేసింది.
ఆ తర్వాత బుల్లితెరకు వచ్చేసింది. రష్మీ జబర్దస్త్ కార్యక్రమంతో పాపులర్ అయ్యాక ఆమెకు హీరోయిన్ గా చేసే ఛాన్స్ మరోసారి తలుపు తట్టింది. గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా అందాలు ఆరబోసి టాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ మధ్యనే విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో కూడా రష్మీ హీరో నందుతో కలిసి నటించిన ప్రేక్షకులను మెప్పించింది.
ఇక రష్మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే 1982 ఏప్రిల్ 27 న విశాఖపట్నంలో జన్మించింది. పుట్టింది ఆంధ్రాలోనే అయినా నిజానికి రష్మీ ఒడిశా రాష్ట్రనికి చెందిన అమ్మాయి. రష్మీ తండ్రి ఉద్యోగ రీత్యా వైజాగ్ లో ఉండుట వలన రష్మీ కూడా వైజాగ్ లోని డిగ్రీ వరకు చదివింది. రష్మీ ఒడిసి బాష బాగా వచ్చు. అయితే తెలుగు మాత్రం పూర్తి స్థాయిలో రాదు. అందుకే రష్మీ జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాలలో తెలుగులో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…