Rashi Khanna : తన అందం, అభినయంతో మంత్ర ముగ్ధులని చేసే అందాల ముద్దుగుమ్మలలో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తొలి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. జిల్, జోరు, బెంగాల్ టైగర్, హైపర్.. తొలిప్రేమ.. వరల్డ్ ఫేమస్ లవర్.. ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మొదటి నుంచి ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించే రాశీ ఖన్నా.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. గ్లామర్ షోలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో రచ్చ చేస్తోంది.
దాదాపు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. అయితే కెరీర్ ఆరంభంలో తాను బాడీ షేమింగ్ ఎదుర్కోన్నానని.. బొద్దుగా ఉండడం వలన దక్షిణాది చిత్రపరిశ్రమ వాళ్లు తనపై కామెంట్స్ చేసేవారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొదట టాలీవుడ్ లో సక్సెస్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేదు. దాంతో కోలీవుడ్ లో సినిమాలు మొదలు పెట్టింది. అక్కడ కూడా నిరాశే ఎదురు అయ్యింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం తో ఇంతకాలం సినిమాలు చేసిన సౌత్ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది.
సౌత్ సినిమాలు చేస్తున్నంత కాలం రొటీన్ ఫార్ములా కు అలవాటు పడ్డా.. అని చెప్పింది. తనకు రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదు అని.. హీరోల పక్కన కాసేపు నటించడం ఆ తరవాత పక్కకి వెళ్లిపోవడం సౌత్ లో రోటీన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయని సౌత్ పరిశ్రమపై ఆరోపణలు చేస్తున్నావా అంటూ తెగ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన రాశీ ఖన్నా.. బాడీ షేమింగ్ గురించి నేను చేసిన ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నారు.
నేను ఎవరినీ కించపరచలేదు.. అని స్పష్టం చేసింది. కాగా, దక్షిణాదిలో చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవాళ్లు. కొంతకాలం గడిచే సరికి సన్నగా మారాలని నిర్ణయించుకున్నాను.. ఫిట్ అయ్యాను. నేను చేస్తున్న వృత్తికి నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని అర్థమైంది. అందుకే సన్న బడ్డాను… అంతేకానీ వాళ్ల నోర్లు మూయించాలని కాదు.. సోషల్ మీడియాలోనూ ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ నేను ఏమాత్రం బాధపడలేదు.. అంటూ చెప్పుకొచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…