Rana : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాల హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. నేటి యంగ్ హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రానా ప్రభాస్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకమైన బాహుబలి చిత్రంలో నటించారు. అదేవిధంగా వెంకటేష్, రానా కలిసి మరో మల్టీస్టారర్ చిత్రంగా రాబోతుందని ఇదివరకే అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా మల్టీస్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న రానా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ చిత్రంలో రానా డానియల్ శేఖర్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇలా వరుసగా మల్టీస్టారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న రానా తాజాగా మరో మల్టీ స్టారర్ చిత్రంతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రానా మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ శర్వానంద్ మల్టీస్టారర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమస్థలో సహాయ దర్శకుడిగా పని చేసినటువంటి ఒక యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేయనున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని దగ్గుబాటి రానా చాలా కాన్ఫిడెన్స్ గా ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వానంద్ కూడా సినిమా కథాంశం నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…