Rana : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాల హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. నేటి యంగ్ హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రానా ప్రభాస్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకమైన బాహుబలి చిత్రంలో నటించారు. అదేవిధంగా వెంకటేష్, రానా కలిసి మరో మల్టీస్టారర్ చిత్రంగా రాబోతుందని ఇదివరకే అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా మల్టీస్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న రానా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ చిత్రంలో రానా డానియల్ శేఖర్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇలా వరుసగా మల్టీస్టారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న రానా తాజాగా మరో మల్టీ స్టారర్ చిత్రంతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రానా మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ శర్వానంద్ మల్టీస్టారర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమస్థలో సహాయ దర్శకుడిగా పని చేసినటువంటి ఒక యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేయనున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని దగ్గుబాటి రానా చాలా కాన్ఫిడెన్స్ గా ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వానంద్ కూడా సినిమా కథాంశం నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…