Ramya Raghupathi : గత కొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటి పవిత్రా లోకేష్తో సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, అందుకనే మహాబలేశ్వరం ఆలయాన్ని సందర్శించారని.. ఈ మధ్య కాలంలో తరచూ వార్తలు వచ్చాయి. అలాగే ఓ కన్నడ న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో నటి పవిత్రా లోకేష్ తనకు నరేష్తో సంబంధం ఉందని అంగీకరించింది. దీంతో వీరి కథ ఊహించని మలుపు తిరిగింది. అయితే కొత్తగా ఇంకో ట్విస్ట్ వచ్చి చేరింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
అసలు తనకు నరేష్ ఇంకా విడాకులు ఇవ్వలేదని.. రమ్య రఘుపతి అన్నారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని.. కరోనా సమయంలో తాను చెల్లించాల్సిన డబ్బులు చేతికి అందలేదని.. అందుకనే ఇతరులకు ఇవ్వలేకపోయానని.. అంతేకానీ తాను డబ్బుల విషయంలో ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. దీనిపై నరేష్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఒక జర్నలిస్ట్నని తనపై ఈ విధంగా ప్రచారం చేయడం బాధగా ఉందన్నారు.
తనకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ విషయం ఇంకా సెటిల్ కాలేదని.. కనుక విడాకులు తీసుకోలేదని.. తాను విడాకుల పత్రాలపై సంతకాలు చేయలేదని.. రమ్య రఘుపతి తెలిపారు. రఘువీరా రెడ్డి తనకు బంధువని అయితే ఆయన పేరును ఎప్పుడూ తాను వాడుకోలేదని అన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని.. డబ్బులు అందరికీ ఇచ్చేశానని.. తనపై ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని.. ఆమె తెలిపారు. అయితే దీనిపై నరేష్ స్పందించాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…