Ramya Raghupathi : గత కొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటి పవిత్రా లోకేష్తో సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, అందుకనే మహాబలేశ్వరం ఆలయాన్ని సందర్శించారని.. ఈ మధ్య కాలంలో తరచూ వార్తలు వచ్చాయి. అలాగే ఓ కన్నడ న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో నటి పవిత్రా లోకేష్ తనకు నరేష్తో సంబంధం ఉందని అంగీకరించింది. దీంతో వీరి కథ ఊహించని మలుపు తిరిగింది. అయితే కొత్తగా ఇంకో ట్విస్ట్ వచ్చి చేరింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
అసలు తనకు నరేష్ ఇంకా విడాకులు ఇవ్వలేదని.. రమ్య రఘుపతి అన్నారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని.. కరోనా సమయంలో తాను చెల్లించాల్సిన డబ్బులు చేతికి అందలేదని.. అందుకనే ఇతరులకు ఇవ్వలేకపోయానని.. అంతేకానీ తాను డబ్బుల విషయంలో ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. దీనిపై నరేష్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఒక జర్నలిస్ట్నని తనపై ఈ విధంగా ప్రచారం చేయడం బాధగా ఉందన్నారు.
తనకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ విషయం ఇంకా సెటిల్ కాలేదని.. కనుక విడాకులు తీసుకోలేదని.. తాను విడాకుల పత్రాలపై సంతకాలు చేయలేదని.. రమ్య రఘుపతి తెలిపారు. రఘువీరా రెడ్డి తనకు బంధువని అయితే ఆయన పేరును ఎప్పుడూ తాను వాడుకోలేదని అన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని.. డబ్బులు అందరికీ ఇచ్చేశానని.. తనపై ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని.. ఆమె తెలిపారు. అయితే దీనిపై నరేష్ స్పందించాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…