Ramya Krishnan : అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. రమ్యకృష్ణ ఒక తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించారు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.
తాజాగా రమ్యకృష్ణ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ నటనతో అదరగొట్టారు. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయసుకి తగ్గ పాత్రల్లో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు రమ్యకృష్ణ గ్లామర్ కి, ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ కి యువత పడి పోయేవారు.
ప్రస్తుతం ఓంకార్ నిర్వహించే ఐకాన్ డ్యాన్స్ షోకి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో తన గురించి ఒక సీక్రెట్ ని రమ్యకృష్ణ బయట పెట్టేశారు. ఐకాన్ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్లు రమ్యకృష్ణ నటించిన ఒక చిత్రంలోని సాంగ్ కి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఇంతకీ ఆ సాంగ్ ఏదంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నా అల్లుడు చిత్రంలోని సయ్యా సయ్యారే అనే మాస్ సాంగ్.
ఈ షోలో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసిన కంటెస్టెంట్లును రమ్యకృష్ణ అభినందిస్తూ.. ఈ సాంగ్ కి డ్యాన్స్ చేసే సమయంలో నేను నాలుగు నెలల గర్భవతిని అంటూ తెలిపారు. అందుకే ఈ పాటని నేను అంత త్వరగా మరచిపోలేను. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు, ఎనర్జీ మరో స్థాయిలో ఉంటాయి అని రమ్యకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2005లో విడుదలైన నా అల్లుడు చిత్రంలో ఎన్టీఆర్ సరసన జెనీలియా, శ్రీయ శరన్ జంటగా నటించారు. ఈ చిత్రం అప్పటిలో ఆశించిన మేరకు ఫలితం సాధించలేకపోనా సయ్యా సయ్యారే సాంగ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రీయ మరియు జెనీలియాకు తల్లిగా, పొగరు బోతు అత్తగా రమ్యకృష్ణ నటించింది. ఈ పాటలో ఎన్టీఆర్ తో రమ్యకృష్ణ, శ్రీయ, జెనీలియా ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…