Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎల్లప్పుడూ వివాదాల్లోనే చిక్కుకుంటుంటారు. ఆయన చేసే కామెంట్లు.. పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. అది అల్లాటప్పా వివాదం ఏమీ కాదు. సాక్షాత్తూ కాబోయే రాష్ట్రపతి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారు అయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఎన్డీఏకు బలం ఉంది కనుక ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంఛనమే కానుంది. అయితే ఆమెపై వర్మ వివాదాస్పద పోస్టు పెట్టారు.
ద్రౌపది రాష్ట్రపతి అయితే మరి ఆమెకు పాండవులు ఎవరు ? అసలు ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అని వర్మ ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ ఆయన ట్వీట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులు రాజాసింగ్, రాకేష్ రెడ్డిలు వర్మపై మండిపడ్డారు. ఒక దళిత మహిళ, అందులోనూ కాబోయే రాష్ట్రపతిని పట్టుకుని అంతలా అవమానిస్తావా.. అంటూ వారు ఆయనపై ఫైరయ్యారు. ఈ క్రమంలోనే వివాదం చెలరేగింది.
అయితే తన తప్పు తెలుసుకున్న వర్మ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తాను ఆమెను అవమానించాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తనకు మహాభారతంలోని ద్రౌపది పాత్ర అంటే ఎంతో ఇష్టమని.. ఆ పాత్రకు రిఫరెన్స్ ఇస్తూ మాత్రమే అలా ట్వీట్ చేశానని.. అంతేకానీ ఆమెను అవమానించాలని.. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని వర్మ అన్నారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. బీజేపీ నాయకులు వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేపు పెట్టాలని చూస్తున్నారు. దీంతో వర్మ చాలా సీరియస్ ట్రబుల్లో పడిపోయారని చెప్పవచ్చు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…