Ragi Laddu : మనం చిరు ధాన్యాలయినటు వంటి రాగులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మనకు విరివిరిగా లభిస్తాయి. ప్రస్తుత కాలంలో వస్తున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది రాగులను ఆహారంగా తీసుకుంటున్నారు. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీ, షుగర్ వంటి వ్యాధులను నియంత్రించడంలో రాగులు ఎంతో సహాయపడతాయి. రాగులను పిండిగా చేసి మనం జావ, ఉప్మా, ఇడ్లీ, రోటీ వంటి వాటిని తయారు చేసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా రాగులతో ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా రాగి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – 250 గ్రా., పల్లీలు – 50 గ్రా., బెల్లం – 250 గ్రా., యాలకుల పొడి – చిటికెడు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 100 ఎంఎల్.
రాగి లడ్డూల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక రాగిపిండిని వేసి కొద్దిగా రంగు మారే వరకు చిన్న మంటపై వేయించుకోవాలి. తరువాత పల్లీలను కూడా వేసి వేయించి పొట్టు తీయాలి. ఈ పల్లీలను ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లేదా కళాయిలో బెల్లాన్ని , నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగి తరువాత వడపోసి మరలా తీగపాకం వచ్చే వరకు వేడి చేయాలి.
బెల్లం పాకం వచ్చిన తరువాత యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన పల్లీలను, రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లగా అయ్యి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకుంటూ తగిన పరిమాణంలో పిండిని తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ రాగి లడ్డూలను రోజుకి ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రాగుల్లో ఉండే పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…