Radhika Apte : రాధిక ఆప్టే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా.. నటిగా తనదైన ముద్రను వేసుకుంది. ప్రస్తుతం ఆమె సౌత్ చిత్రాలేవీ చేయడం లేదు కానీ బాలీవుడ్లో మాత్రం అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉంది. కాకపోతే.. సినిమాల కంటే.. ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, ఇంటర్వ్యూలలో ఆమె చెప్పే విషయాలు కాంట్రవర్సీ అవుతూ.. ఆమెను వార్తలలో ఉండేలా చేస్తుంటాయి. ఇక రక్తచరిత్ర మూవీతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే.. ఆ తర్వాత ధోని, లెజెండ్, కబాలి, లయన్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో ఆమె చేయలేదు.
అయితే తాజాగా ఆమె పెళ్లి వ్యవస్థపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నిజానికి రాధికా ఆప్టే కూడా పెళ్లి చేసుకుందన్న సంగతి చాలామందికి తెలీదు. ఆ విషయంపై కూడా ఈమె స్పందించింది. నాకు పెళ్లి వ్యవస్థపై అస్సలు నమ్మకం లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే అనుమానం అందరికీ రావడం సహజం. నేను కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 8 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ను రాధికా ఆప్టే వివాహం చేసుకుంది.
అయితే 2016లో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన ఒక బోల్డ్ షార్ట్ ఫిలిం మేకింగ్ వీడియోలు ఎవరో తన తల్లికి పంపారని, ఆమెతో పాటు అప్పట్లో ఆ వీడియో అందరి మొబైల్స్ లో చక్కర్లు కొట్టింది అని, ఆఖరికి తన డ్రైవర్ కూడా ఆ వీడియో చూశాడని, తనకు ఆ సమయంలో ఏమి చేయాలో అర్ధం కాలేదని, చివరికు 4 రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యానని రాధిక చెప్పింది. అయితే తరువాత ఆ సంఘటనే తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పింది రాధికా. అప్పటి తన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది ఈ అమ్మడు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…