Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కంప్లీట్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. విక్రమాదిత్య అనే క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డె మెస్మరైజ్ చేయనుంది. ఈ సినిమా లేటెస్ట్ టీజర్ ను సోషల్ మీడయాలో రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ అభిమానులు ఈ టీజర్ కు హైప్ ను క్రియేట్ చేశారు. రాధేశ్యామ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ హల్ చల్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ రియల్ లైఫ్ పామిస్ట్ ను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఫేమస్ హస్త సాముద్రిక నిపుణుడైన చెయిరో విలియం జాన్ వార్నర్ అనే వ్యక్తి రియల్ లైఫ్ తో కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐరిష్ జ్యోతిష్కుల్లో ఒకరు ఈ వార్నర్. తన వినూత్నమైన టాలెంట్ తో ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేశారు. అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా రాధేశ్యామ్ సినిమాకు కమర్షియల్ అంశాల్ని జోడించి జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని ప్లాన్ చేశారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ పాత్ర కూడా ఎంతో వైవిధ్యంగా ఉండనుంది. మరి దర్శకుడు రాధాకృష్ణ ఈ పాత్రను కూడా ఏదైనా కారణంతో ప్లాన్ చేశారా.. లేదా కల్పితమా అనేది తెలియాలి. ఈ సినిమాను ఎక్కువగా ఇటలీ దేశంలో తెరకెక్కించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ సారి ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…