Janhvi Kapoor : తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీదేవి. యావత్ సినీ ప్రపంచానికి అతిలోక సుందరి. ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ధడక్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినంత ఈజీగా ఆమెకు స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. జాన్వీ కపూర్ నటించే సినిమాలు సక్సెస్ లిస్ట్ లోకి చేరకపోయినా.. ఆమె నటనకు మంచి గుర్తింపే వస్తోంది.
ఈమె కోసమే బాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్స్ కథల్ని సిద్ధం చేస్తున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి కూడా ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయట. అలాగే కోలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వచ్చాయని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలకు కారణం కూడా చెప్పింది ఈ బ్యూటీ.
సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో ఇప్పటి వరకు జాన్వీకి నచ్చిన పాత్రలు రాలేదట. సినిమా అవకాశాలైతే వస్తున్నాయి గానీ.. అందుకు తగిన మంచి పాత్రలు మాత్రం రాలేదని అన్నది. అలాగే మంచి కథ దొరికితే టాలీవుడ్, కోలీవుడ్ లలో సినిమాలు చేస్తానని చెప్పింది. తాను పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
లేటెస్ట్ గా కొంతమంది టాలీవుడ్ స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్స్ జాన్వీ కపూర్ కోసం ప్రయత్నిస్తున్నారట. జాన్వీ కపూర్ కూడా తెలుగులో ఓ మంచి స్టోరీతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి తెలుగు, తమిళంలో ఈ బ్యూటీకి సెట్ అయ్యే పాత్రలు, కథలు ఎప్పటికి సిద్ధం అవుతాయో చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…