MS Dhoni : భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. భారత జట్టుకు ఎంతగానో సేవలందించిన ధోనీ ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైరై కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ సాక్షిని పెళ్లి చేసుకున్న ధోనీ కుమార్తె జీవాతో కలిసి ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుకు ధోనీ మెంటార్గా కూడా వ్యవహరించాడు.
అయితే ధోనీకి పెళ్లి కాక ముందు.. 2008-2009 సంవత్సరంలో నటి రాయ్ లక్ష్మీతో సంబంధం ఉందని, వారు ప్రేమించుకుంటున్నారని, రిలేషన్షిప్లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అందుకు ఊతం ఇస్తూ వారు ఐపీఎల్ సందర్భంగా పలు పార్టీలకు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. తన ఫ్రెండ్ సురేష్ రైనాతో కలిసి ధోనీ.. రాయ్ లక్ష్మీ ఇచ్చిన పార్టీలకు, ఆమె బర్త్డేలకు హాజరయ్యాడు. అయితే ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ.. కేవలం ఒక ఏడాది మాత్రమే వారు కలసి ఉన్నారు. తరువాత విడిపోయారు.
ఈ క్రమంలోనే ధోనీతో తనకు ఉన్న అనుబంధంపై రాయ్ లక్ష్మీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించింది. ధోనీ ఓ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని, అతన్ని ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేందుకు వెనుకాడదని.. రాయ్ లక్ష్మీ పేర్కొంది. అయితే ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది..? ఎందుకు విడిపోయారు..? అన్న వివరాలను ఆమె చెప్పలేదు. కానీ ధోనీతో విడిపోయాక తన జీవితంపై ఒక మచ్చ పడిందని ఆమె తెలిపింది.
ధోనీ, నేను విడిపోయాం. అతను పెళ్లి చేసుకున్నాడు. నేను ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. రేపు ఎప్పుడైనా నేను వివాహం చేసుకుని పిల్లల్ని కంటే ఆ తరువాత ధోనీ, తన మ్యాటర్ బయట పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. నా జీవితంపై అది మచ్చలా ఉంది.. అంటూ రాయ్ లక్ష్మీ సంచలన విషయాలను బయట పెట్టింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…