Pushpa Movie : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు స్నేహ భావంతో మెలుగుతున్నారు. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అల్లు అర్జున్ సినిమాకి సపోర్ట్ అందిచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రైజ్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రమిది. ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్గా నటిస్తుండగా సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప ది రైజ్ చిత్రం డిసెంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.
సమంత, బన్నీపై సాగుతున్న ఈ పాటతో చిత్రీకరణ ముగియనుంది. ఒకవైపు పుష్ప ది రైజ్ నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరో వైపు ప్రమోషనల్ ప్లాన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇండియాలో ప్రధానమైన నగరాలకు పుష్ప యూనిట్ వెళ్లి ప్రచారం చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడట. ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…