Pushpa Movie : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు స్నేహ భావంతో మెలుగుతున్నారు. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అల్లు అర్జున్ సినిమాకి సపోర్ట్ అందిచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రైజ్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రమిది. ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్గా నటిస్తుండగా సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప ది రైజ్ చిత్రం డిసెంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.
సమంత, బన్నీపై సాగుతున్న ఈ పాటతో చిత్రీకరణ ముగియనుంది. ఒకవైపు పుష్ప ది రైజ్ నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరో వైపు ప్రమోషనల్ ప్లాన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇండియాలో ప్రధానమైన నగరాలకు పుష్ప యూనిట్ వెళ్లి ప్రచారం చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడట. ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…