Pune : ఓ వ్యక్తి బిజినెస్ ట్రిప్ మీద వేరే ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పి భార్యను మోసం చేశాడు. తన ప్రియురాలితో కలిసి వేరే ప్రాంతంలో ఉన్న ఓ హోటల్కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. అయితే అతనిపై ముందుగానే నిఘా ఉంచిన అతని భార్య అతన్ని అన్ని ఆధారాలతో సహా పట్టుకుంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి (41) బిజినెస్ చేస్తుంటాడు. బిజినెస్ ట్రిప్ మీద బెంగళూరు వెళ్తున్నానని చెప్పి తన ప్రియురాలితో కలిసి అతను పూణె వెళ్లాడు. అయితే అతనిపై ముందు నుంచీ అనుమాన పడిన అతని భార్య అతని కారులో జీపీఎస్ డివైస్ను ఫిట్ చేయించింది. దీంతో అతను ఎక్కడికి వెళ్లిందీ.. సులభంగా తెలిసిపోయింది.
ఎంక్వయిరీ చేయగా.. అతను తన ప్రియురాలిని తీసుకుని పూణెలోని ఓ హోటల్కు వెళ్లాడని అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేస్తే తెలిసింది. ఇక ఆ హోటల్లో దిగేందుకు గాను ఆ వ్యక్తి తన ప్రియురాలినే తన భార్యగా చెప్పాడు. అందుకు సాక్ష్యంగా తన భార్య ఆధార్ కార్డును ఆమెకు వాడాడు. ఈ క్రమంలో అతని భార్య ఆ హోటల్కు వచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్తోపాటు ఇతర వివరాలను సేకరించింది. వాటితో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ వ్యక్తి, అతని ప్రియురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…