Prudhvi Raj : కమెడియన్ పృథ్వి.. ఈయననే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అని కూడా పిలుస్తారు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. అయితే గత కొంత కాలంగా పృథ్వీ సినిమాల్లో ఆఫర్ల కోసం అవస్థలు పడుతున్నారు. ఈయన గతంలో వైసీపీలో చేరారు. ఓ పదవిలో కొనసాగారు. తరువాత ఆయనపై కొన్ని ఆరోపణలు రావడంతో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లోనే బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈయనకు కుమార్తె కూడా ఉంది. ఆమె ఇప్పుడు ఓ సినిమాలో హీరోయిన్గా కూడా నటిస్తోంది. ఈ మేరకు ఆ చిత్ర విశేషాలను పృథ్వి మీడియాతో పంచుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ పృథ్వి పలు విషయాలను వెల్లడించారు.
తన కుమార్లె శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ చేసిందని.. మలేషియా వెళ్లి సెటిల్ కావాలని అనుకుందని తెలిపారు. అయితే డ్యాన్స్ మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుందని, నటనలోనూ ప్రతిభ చూపిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు సినిమాల్లోని సన్నివేశాలను కూడా మిమిక్రీలా చేసి చూపిస్తుందని తెలిపారు. ఇక తన కుమార్తెని ఇండస్ట్రీకి ఘనంగా పరిచయం చేయాలని అనుకుంటున్నానని అన్నారు. అందులో భాగంగానే తన స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా.. కొత్త రంగు ప్రపంచం అనే సినిమాను నిర్మిస్తున్నారని అన్నారు. అందులో తన కుమార్తె హీరోయిన్ గా నటిస్తుందని తెలిపారు.
అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని పృథ్వి వివరించారు. ఇక శ్రీ ఆర్పీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తుందని.. దీన్ని దర్శకుడు అత్యంత ప్రతిభతో తెరకెక్కిస్తున్నాడని.. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుందని.. అప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని.. పృథ్వి తెలిపారు. ఇక తనను ఆదరించినట్లే తన కుమార్తెను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…