Bhimla Nayak : కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఒక్క చిత్ర యూనిట్ తమ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పలువురు మేకర్స్ తమ చిత్రాలకు గాను కొత్త రిలీజ్ డేట్లను కూడా ప్రకటించేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్ర నిర్మాత ఎస్.నాగవంశీ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం డీజే టిల్లు. ఈయన భీమ్లా నాయక్ నిర్మాత కూడా. డీజే టిల్లు మూవీ ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాగ వంశీ మాట్లాడుతూ.. తాను భీమ్లా నాయక్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.
భీమ్లా నాయక్ విడుదలకు గాను రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1వ తేదీన ఈ మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నామని.. అయితే దీనిపై సీఎం జగన్ను అడిగితే బాగుంటుందని అన్నారు. ఆయన నిర్ణయంపైనే భీమ్లా నాయక్ విడుదల ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్, రాత్రి కర్ఫ్యూలను ఎత్తేస్తేనే భీమ్లా నాయక్ విడుదల అవుతుందని తెలిపారు.
ఇక డీజే టిల్లు యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని, భీమ్లానాయక్ మాస్ మూవీ అని అన్నారు. డీజే టిల్లు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అయితే.. భీమ్లా నాయక్ ఆంధ్రా మీల్స్ వంటిదని నాగ వంశీ అన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ థియేటర్ల విషయంలో తీసుకునే నిర్ణయంపైనే భీమ్లా నాయక్ విడుదల ఆధార పడి ఉందని స్పష్టమైంది. మరి భీమ్లా నాయక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…