Bhimla Nayak : కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఒక్క చిత్ర యూనిట్ తమ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పలువురు మేకర్స్ తమ చిత్రాలకు గాను కొత్త రిలీజ్ డేట్లను కూడా ప్రకటించేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్ర నిర్మాత ఎస్.నాగవంశీ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం డీజే టిల్లు. ఈయన భీమ్లా నాయక్ నిర్మాత కూడా. డీజే టిల్లు మూవీ ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాగ వంశీ మాట్లాడుతూ.. తాను భీమ్లా నాయక్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.
భీమ్లా నాయక్ విడుదలకు గాను రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1వ తేదీన ఈ మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నామని.. అయితే దీనిపై సీఎం జగన్ను అడిగితే బాగుంటుందని అన్నారు. ఆయన నిర్ణయంపైనే భీమ్లా నాయక్ విడుదల ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్, రాత్రి కర్ఫ్యూలను ఎత్తేస్తేనే భీమ్లా నాయక్ విడుదల అవుతుందని తెలిపారు.
ఇక డీజే టిల్లు యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని, భీమ్లానాయక్ మాస్ మూవీ అని అన్నారు. డీజే టిల్లు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అయితే.. భీమ్లా నాయక్ ఆంధ్రా మీల్స్ వంటిదని నాగ వంశీ అన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ థియేటర్ల విషయంలో తీసుకునే నిర్ణయంపైనే భీమ్లా నాయక్ విడుదల ఆధార పడి ఉందని స్పష్టమైంది. మరి భీమ్లా నాయక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…