Pranitha Subhash : నటి ప్రణీత ఈ మధ్య కాలంలో తన బేబీ బంప్ ఫొటోలతో తరచూ వార్తల్లో నిలిచింది. అయితే ఈమె తాజాగా పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. కరోనా సమయంలో అతిథులు ఎవరూ లేకుండానే వివాహం చేసుకున్న ఈమె ఒక్కసారిగా తన పెళ్లి విషయం చెప్పి అందరికీ షాకిచ్చింది. తరువాత గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నటి ప్రణీత నితిన్ రాజు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. అయితే వివాహం అయ్యాక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ ఈమె భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తుందా.. లేదా.. అన్న విషయంపై అయితే స్పష్టత రాలేదు. అయితే బిడ్డ జన్మించాక ప్రణీత ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చూస్తూ మురిసిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ప్రణీత ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన బిడ్డ ఫొటోను జత చేసి దానికి ఒక కామెంట్ను పెట్టింది. గత కొద్ది రోజులుగా తాను పడ్డ బాధ అంతా ఇంతా కాదని.. అయితే తన బిడ్డ జన్మించగానే ఆ బాధనంతా మర్చిపోయానని తెలియజేసింది. తన డెలివరీకి సహకరించిన గైనకాలిజస్టు డాక్టర్ జయశ్రీ, డాక్టర్ సునీల్ ఈశ్వర్, మత్తు డాక్టర్ సుబ్బు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసింది. కాగా ప్రణీత బెంగళూరులోని ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…