Prabhas Lamborghini Car : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ తన రేంజ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఖరీదైన కార్లు, విలువైన వస్తువులు వాడుతూ వార్తలలో నిలుస్తున్నాడు. ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి కూడా చిక్కాడు ప్రభాస్. తాజాగా ఈ లంబోర్గిని కారులో డైరెక్టర్ మారుతి షికారుకు వెళ్లడం వైరల్గా మారింది.. ప్రభాస్ లంబోర్గిని కారుని డైరెక్టర్ మారుతి నడుపుతున్న వీడియోని మారుతి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియోని షేర్ చేసి.. మేము ప్రేమ గురించి ప్రార్థించం, కేవలం కార్ల కోసమే ప్రార్థిస్తాం అని వీడియాకి కామెంట్గా పెట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో జరుగుతున్న సినిమా షూట్ గ్యాప్ లో మారుతి ఇలా చక్కర్లు కొడుతున్నాడని అంటున్నారు. ప్రభాస్ లంబోర్గిని కారుని మారుతి డ్రైవ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తునే , మారుతీతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు.
ప్రభాస్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటికి అదనంగా గత ఏడాది లంబోర్గిని కారు వచ్చి చేరింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి. ఎన్టీఆర్ కూడా కొన్ని రోజుల క్రితం ఇదే కారుని కొనుగోలు చేశాడు. అయితే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సలార్, ప్రాజెక్ట్ కెతో పాటు రాజా డీలక్స్ సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నాడు. త్వరలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన ఈ సినిమాలో నటించనున్నారు. వీరిద్దరు హీరోలుగా ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…