Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో చేసిన కొన్ని సినిమాలు ఘోరంగా నిరాశ పరిచాయి. ఛత్రపతి తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత చేసిన ఓ సినిమాకు ఆయన అభిమానులే బాధ పడుతుంటారు. అదేంటంటే.. కృష్ణవంశీ తెరకెక్కించిన చక్రం మూవీ థియేటర్లలో దారుణంగా నిరాశ పరిచింది.
ఈ సినిమా చేసే ముందు చాలా మంది ప్రభాస్ను హెచ్చరించారట. కథ బాగానే ఉన్నా మన వాళ్లకు కనెక్ట్ అవ్వదు.. రిస్క్ తీసుకోవద్దు అన్నారట. అప్పటికి తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ప్రేక్షకులు చూడరు అనే నానుడి ఉంది. అయినా కూడా ప్రభాస్ డేర్ చేశాడు. మొత్తానికి మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆయన శ్రేయోభిలాషులతోపాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చక్రం సినిమాను చేయొద్దంటూ ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చారు. అందులో చిరంజీవి ముందున్నారు. ఆ తర్వాత గోపీచంద్ కూడా చెప్పాడట.
ఇదే విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పాడు. తరుణ్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలు వద్దని చెప్పినా వినలేదట ప్రభాస్. కేవలం ఆయన మొహమాటం కారణంగా కృష్ణవంశీకి మాటిచ్చేశాడు. ఇచ్చిన మాట కోసం చక్రం సినిమా చేశాడు. నిర్మాతలతోపాటు బయ్యర్లకు కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఆసిన్, ఛార్మి ఇందులో హీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. అయితే థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ.. యూట్యూబ్, టెలివిజన్ లో మాత్రం ఇప్పటికీ చక్రంకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…